ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST
ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,72,839కి కరోనా కేసులు చేరగా 7,042 మంది మృతిచెందారు. 5,429 యాక్టివ్ కేసులు ఉండగా 8,60,368 మంది రికవరీ అయ్యారు. కొత్తగా కరోనాతో గుంటూరు, కృష్ణ, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు.