మాకు ‘సంక్షేమం’ అక్కర్లేదా?

ABN , First Publish Date - 2020-12-31T03:42:10+05:30 IST

అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు ముకుంద డిమాండ్‌ చేశారు.

మాకు ‘సంక్షేమం’ అక్కర్లేదా?
తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఆశవర్కర్లు, సీఐటీయూ నాయకులు

 ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా

నాయుడుపేట టౌన్‌, డిసెంబరు 30 : అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు ముకుంద డిమాండ్‌ చేశారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో అంగన్‌వాడీ, ఆశవర్కర్లు ప్రతి కుటుంబానికి సేవలందించారని అటువంటి వారికి న్యాయం చేయాలన్నారు. అనంతరం తహసీల్దారు శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, ఆశ వర్కర్ల యూనియన్‌ నాయకురాలు సుజాత,  శారద, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T03:42:10+05:30 IST