44వేల కేసుల చేరువలో..కొత్తగా 778 పాజిటివ్‌లు..

ABN , First Publish Date - 2020-09-12T10:52:57+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం 778 పాజిటివ్‌లు నమోదయ్యాయి.

44వేల కేసుల చేరువలో..కొత్తగా 778 పాజిటివ్‌లు..

1,173 మంది డిశ్చార్జ్‌ 


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 11 : జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం 778 పాజిటివ్‌లు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 43,985 కేసులు రికార్డుకెక్కాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరు నగరంలో ఐదుగురు, వెంకటగిరి, గూడూరు మండలం చెన్నూరు, సంగం ఒక్కొక్కరు వంతున మృతి చెందారు. అలాగే నారాయణ, జీజీహెచ్‌, నెల్లూరు ఆసుపత్రులతోపాటు కోవిడ్‌కేర్‌, క్వారంటైన్‌ సెంటర్ల నుంచి 1173 మంది డిశ్చార్జ్‌ చేశారు. 


దుత్తలూరులో సంపూర్ణ లాక్‌డౌన్‌

ఉదయగిరి రూరల్‌: దుత్తలూరు పంచాయతీలో శనివారం ఉదయం 11 నుంచి ఆదివారం రాత్రి వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు తహసీల్దారు బీమాప్రసాద్‌  పేర్కొన్నారు. కాగా, దుత్తలూరులో 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-12T10:52:57+05:30 IST