ఇంటర్ ప్రాక్టికల్స్కు 2,679 మంది హాజరు
ABN , First Publish Date - 2020-02-12T09:31:31+05:30 IST
జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షలకు మంగళవారం మొత్తం 2,679 మంది హాజరయ్యారు.
![ఇంటర్ ప్రాక్టికల్స్కు 2,679 మంది హాజరు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నెల్లూరు (విద్య) ఫిబ్రవరి 11 : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షలకు మంగళవారం మొత్తం 2,679 మంది హాజరయ్యారు. ఉదయం జనరల్ విద్యార్థులు 1,000 మందికిగాను 982 మంది, ఒకేషనల్ విద్యార్థులు 467 మందికిగాను 444 మంది హాజరయ్యారు. మధ్నాహ్నం జనరల్ విద్యార్థులు 946 మందికిగాను 938 మంది, ఒకేషనల్ విద్యార్థులు 325 మందికిగాను 315 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఆర్ఐవో 3, డీఈసీ సభ్యులు 4, హెచ్పీసీ సబ్యులు 3, ఫ్లైయింగ్ స్క్వాడ్ 5 వెరసి 15 కేంద్రాలను పరిశీలించారు.