యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-14T05:28:41+05:30 IST
నంద్యాల ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓబులేసు కొడుకు వెంకటకృష్ణ (24) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
నంద్యాల (నూనెపల్లె), నవంబరు 13: నంద్యాల ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓబులేసు కొడుకు వెంకటకృష్ణ (24) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటకృష్ణ హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలలో ఆన్లైన్ మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లుగా టూటౌన్ పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం విచారణ నిమిత్తం పోలీసులు నంద్యాలకు వచ్చారు. దీంతో వెంకటకృష్ణ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.