నేటి నుంచి యాగంటిలో దర్శనాలు నిలిపివేత
ABN , First Publish Date - 2020-08-11T18:02:27+05:30 IST
మండలంలోని యాగంటి ఉమామహేశ్వర ఆలయాన్ని మంగళవారం నుంచి..
బనగానపల్లె(కర్నూలు): మండలంలోని యాగంటి ఉమామహేశ్వర ఆలయాన్ని మంగళవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో డీఆర్కేవీ ప్రసాద్ తెలిపారు. అర్చకులు, కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 19వ తేదీన శానిటైజేషన్ తర్వాత పునఃదర్శనం కల్పిస్తామని తెలిపారు. ఉమామహేశ్వరస్వామి వారికి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.