పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా

ABN , First Publish Date - 2020-12-31T04:59:51+05:30 IST

టీడీపీ పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి, తెలుగుయువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌చౌదరి పేర్కొన్నారు.

పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా
భూపాల్‌చౌదరి


  టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ

 ప్రధాన కార్యదర్శి భూపాల్‌చౌదరి


ఆదోని, డిసెంబరు 30: టీడీపీ పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని కర్నూలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి, తెలుగుయువత రాష్ట్ర నాయకుడు భూపాల్‌చౌదరి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 


‘రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ను నియమించాలి’

ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 30: ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ను నియమించాలని విద్యార్థి జేఏసీ కన్వీనర్‌ మల్లికార్జున డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్ట్స్‌ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ లేకపోవడంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అనంతరం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డా.అయ్యప్పకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాజు, తిరుమలేష్‌, రామచంద్రనాయుడు, మోహన్‌రాజు, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T04:59:51+05:30 IST