మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-02-08T11:06:43+05:30 IST

మండలంలోని కడమలకాల్వకు చెందిన మనీషా(20) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ కీర్తి కథనం మేరకు..

మహిళ ఆత్మహత్య

బండి ఆత్మకూరు, పిబ్రవరి 7: మండలంలోని కడమలకాల్వకు చెందిన మనీషా(20) ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ కీర్తి కథనం మేరకు.. ఆళ్ళగడ్డ మండలం బత్తలూరు మనీషాకు, కడమలకాల్వ శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం పెళైంది. మనీషా బావ నారాయణ మనీషాను వేధించేవాడని, భర్త, అత్త లక్ష్మీదేవి, తోడి కోడలు రామేశ్వరమ్మ అడ్డుచెప్పేవారు కాదని, ఈ వేధింపులు భరించలేక  తమ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసకుందని మృతురాలి తండ్రి నాగశేషుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-02-08T11:06:43+05:30 IST