విద్యాకానుక అందరికీ అందాలి: డీఈవో
ABN , First Publish Date - 2020-12-13T05:42:14+05:30 IST
ప్రతి విద్యార్థికి జగనన్న విద్యాకానుక కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు డీఈవో సాయిరాం సూచించారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 12: ప్రతి విద్యార్థికి జగనన్న విద్యాకానుక కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు డీఈవో సాయిరాం సూచించారు. ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యాకానుక కిట్లలో భాగమైన బూట్లను పరిశీలించారు. బూట్ల సైజ్లు సరిపోకపోతే.. మార్చి ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఏఎంవో డా.వీ.ప్రసాద్ తదితరులు ఉన్నారు.