శ్రీశైలం దేవస్థానం ఈవో ఫేస్‌బుక్ హ్యాక్

ABN , First Publish Date - 2020-11-27T15:02:55+05:30 IST

శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఫేస్‌బుక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యక్ చేశారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో ఫేస్‌బుక్ హ్యాక్

కర్నూలు: శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఫేస్‌బుక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు  హ్యక్ చేశారు. వెంటనే అలెర్ట్ అయ్యిన ఈవో...తన పేరుతో ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు డబ్బు పంపమని మెసేజ్‌లు పెడుతున్నారని, దయచేసి ఎవరు డబ్బు పంపవద్దని కోరారు. పొరపాటున కూడా తన పేరుతో  ఎవరైనా ఫేస్‌బుక్ మెసెంజర్‌లో డబ్బులు పంపమని అడిగితే పంపి మోసపోవద్దని ఈవో కెఎస్ రామారావు వినతి చేశారు. 

Updated Date - 2020-11-27T15:02:55+05:30 IST