శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-10-19T14:28:18+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో 4 లక్షల 31 వేల 115 క్యూసెక్కుల మేర వచ్చి చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం  కొనసాగుతోంది. ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో 4,31,115 క్యూసెక్కుల మేర వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అవుట్ ఫ్లో 5,00,301 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ 212.4385 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2020-10-19T14:28:18+05:30 IST