అన్నదాన పథకానికి విరాళం
ABN , First Publish Date - 2020-12-12T05:05:58+05:30 IST
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం కర్నూలుకు చెందిన డీసీ రూపా నారాయణమూర్తి విరాళం అందించారు.
శ్రీశైలం, డిసెంబరు 11: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం కర్నూలుకు చెందిన డీసీ రూపా నారాయణమూర్తి విరాళం అందించారు. కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసుకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.