స్వామి అమ్మవార్ల పల్లకి సేవ
ABN , First Publish Date - 2020-11-16T05:25:55+05:30 IST
శ్రీశైలక్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు.

శ్రీశైలం, నవంబరు 15: శ్రీశైలక్షేత్రంలో లోకకళ్యాణం కోసం ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకిలో ఆశీనులనుజేసి శాస్ర్తోక్తంగా షోడశోపచార పూజలు చేసి ఉత్సవాన్ని నిర్వహించారు.