సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ
ABN , First Publish Date - 2020-11-25T05:40:13+05:30 IST
మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి మంగళవారం భక్తులు వెండి నాగపడగను సమర్పించారు.
పాణ్యం నవంబరు 24: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి మంగళవారం భక్తులు వెండి నాగపడగను సమర్పించారు. నంద్యాల పట్టణానికి చెందిన సుబ్బయ్య కుమారుడు రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు స్వామివారికి కిలో 68 గ్రాముల వెండి నాగపడగను ఆలయ అధికారి సుబ్బారెడ్డికి అందజేశారు. దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ప్రసాద్, అర్చకులు సుబ్బనారాయణశర్మ, సురేష్శర్మ, రోహిత్శర్మ పాల్గొన్నారు.