సంచార సంజీవని ప్రారంభం
ABN , First Publish Date - 2020-07-18T10:50:57+05:30 IST
జిల్లాలో సంచార సంజీవని సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ..

కర్నూలు, జూలై 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంచార సంజీవని సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సంచార వాహనాలను డీఆర్వో పుల్లయ్య, కర్నూలు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకటరామం ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. తొలి రోజు కలెక్టరేట్లోని వివిధ విభాగాల ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాలు మేరకు సంచార సంజీవని సేవలను విస్తృతం చేశామని తెలిపారు. వీటి ద్వారా జిల్లాలోని మూడు డివిజన్లలో కరోనా పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే మూడు సంజీవని వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితుల నుంచి నమూనాలను సేకరించేందుకు ఈ వాహనాలను వినియోగిస్తామని తెలిపారు. ఒక్కో బస్సులో ఒకేసారి పదిమందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నమూనాల సేకరణ నోడల్ అధికారి విశ్వేశ్వరయ్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.