‘పింఛన్, రేషన్ ఇంటి వద్దనే ఇవ్వాలి’
ABN , First Publish Date - 2020-04-01T10:46:38+05:30 IST
కరోనా విపత్తు కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ మోతాదులో ఉండే దివ్యాంగులకు, వృద్ధులకు పింఛన్, రేషన్ సరుకులను ఇంటి వద్దకే తెచ్చివ్వాలని రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షుడు ఏ బాలసుబ్బయ్య డిమాండ్ చేశారు.

నంద్యాల, మార్చి 31: కరోనా విపత్తు కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ మోతాదులో ఉండే దివ్యాంగులకు, వృద్ధులకు పింఛన్, రేషన్ సరుకులను ఇంటి వద్దకే తెచ్చివ్వాలని రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షుడు ఏ బాలసుబ్బయ్య డిమాండ్ చేశారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దివ్యాంగులకు, వృద్ధులకు వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి పింఛన్ అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పింఛన్తో పాటు రేషన్ కూడా ఇంటి వద్దకే వచ్చి అందజేయాలని కోరారు. రోగ నిరోధక శక్తి వృద్ధులు, దివ్యాంగుల్లో తక్కువగా ఉంటుందని, రేషన్ కోసం వెళ్తే క్యూలో నిలబడలేక మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్దకే తెచ్చివ్వాలని కోరారు.