ట్రాక్టర్ ఇంజన్పై నుంచి పడి..
ABN , First Publish Date - 2020-11-15T05:30:00+05:30 IST
మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు (45) ట్రాక్టర్ ఇంజన్ నుంచి కింద పడి మృతి చెందాడు.

ఓర్వకల్లు, నవంబరు 15: మండలంలోని పూడిచెర్ల గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు (45) ట్రాక్టర్ ఇంజన్ నుంచి కింద పడి మృతి చెందాడు. ఆదివారం వెంకటేశ్వర్లు కొమ్ముచెరువు ఆంజనేయస్వామిని దర్శించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. పొగాకు గోడౌన్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ట్రాక్టర్ ఇంజన్పై కూర్చున్న అతడు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్త చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.