ముగ్గురికి నెగిటివ్ రిపోర్టు
ABN , First Publish Date - 2020-03-27T10:32:03+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరిన మరో ముగ్గురికి కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సూపరింటెండెంట్ డా.జీఎస్ రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్), మార్చి 26: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరిన మరో ముగ్గురికి కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సూపరింటెండెంట్ డా.జీఎస్ రాంప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఆసుపత్రిలో 9 కరోనా అనుమానిత కేసులు నమోదు కాగా, అన్ని నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. దుబాయి నుంచి వచ్చిన భార్యభర్తలు కర్నూలుకు రాగా, ఈనెల 16న దగ్గు, జ్వరం ఉండటంతో కర్నూలు ఆసుపత్రిలో చేరారు. అలాగే ఈనెల 22న జర్మనీ నుంచి ఓ వ్యక్తి రాగా ఐసొలేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ మూడు కేసులు రిపోర్టులు గురువారం విడుదల కాగా, ఇవన్నీ నెగిటివ్గా నిర్ధారణ అయ్యాయి. వీటితో మరో 10 మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండటంతో ఐసొలేషన్ వార్డులో వారికి స్వాఫ్ పరీక్షలు నిర్వహించి తిరుపతికి పంపారు. 10 మంది రోగులకు కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.