‘గౌరవంగా అంత్యక్రియలు జరపాలి’
ABN , First Publish Date - 2020-08-03T10:23:04+05:30 IST
మృతదేహాల నుంచి కరోనా రాదని, కరోనాతో మృతి చెందిన వ్యక్తుల మృత దేహాల అంత్యక్రియలు గౌరవంగా నిర్వ హించాలని ..
నంద్యాల (ఎడ్యుకేషన్), ఆగస్టు 2: మృతదేహాల నుంచి కరోనా రాదని, కరోనాతో మృతి చెందిన వ్యక్తుల మృత దేహాల అంత్యక్రియలు గౌరవంగా నిర్వ హించాలని నంద్యాల ఎమ్మె ల్యే శిల్పా రవిచంద్రకి షోర్రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం నంద్యాల నవ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో కరోనా మృత దేహాల వల్ల వైరస్ వ్యాపించదని, ప్రజల్లో అవగాహన కల్పి స్తూ పట్టణంలో ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచం ద్రకిషోర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్తో మృతి చెందిన మృతదేహాల నుంచి వైరస్ సోకదని, వారి అంత్యక్రియలను అడ్డుకోకూడదని అన్నారు. మృతదేహాల పట్ల గౌరవంగా అంత్యక్రియలు జరపాలని అన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
నంద్యాల: నంద్యాల నియోజకవర్గంలో ఆర్థిక స్థోమత లేక, వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 79 మందికి రూ.2లక్షల చెక్కులను ఆదివా రం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి బాధితులకు అందజేశారు. ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.