వైద్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
ABN , First Publish Date - 2020-11-24T06:04:08+05:30 IST
తన పట్ల అసభ్యకరంగా మాట్లాడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన గిరిజన మహిళ అభ్యర్థి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
కర్నూలు(హాస్పిటల్), నవంబరు 23: తన పట్ల అసభ్యకరంగా మాట్లాడిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన గిరిజన మహిళ అభ్యర్థి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గిరిజన మహిళా అభ్యర్థికి గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్బంగా గిరిజన మహిళా అభ్యర్థి చిన్న లక్ష్మీబాయి మాట్లాడుతూ తాను స్టాఫ్ నర్సు పోస్టులు దరఖాస్తు చేసుకున్నానని, అయితే నాన్ లోకల్ కింద పోస్టు రాలేదన్నారు. దీనిపై వివరణ అడుగగా సూపరింటెండెంట్ తనను అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. దీనిపై సూపరింటెండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ తను మహిళా అభ్యర్థి పట్ల అసభ్యకరంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.