కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం
ABN , First Publish Date - 2020-07-19T16:24:07+05:30 IST
కర్నూలు : జిల్లాలోని మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

కర్నూలు : జిల్లాలోని మంత్రాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్పై భార్యా పిల్లలతో ఐదుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బైక్ డివైడర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్నాటకలోని రాయచూరు జిల్లా తుంగభద్రకు చెందిన వారిగా పొలీసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.