కూరగాయల లారీ బోల్తా

ABN , First Publish Date - 2020-12-30T05:43:19+05:30 IST

మండలంలోని ప్యాలకుర్తి-కొత్తూరు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఏడుగురు గాయపడ్డారని ఎస్‌ఐ మలికార్జున తెలిపారు.

కూరగాయల లారీ బోల్తా

  1. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు  


 కోడుమూరు (రూరల్‌), డిసెంబరు 29: మండలంలోని ప్యాలకుర్తి-కొత్తూరు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఏడుగురు గాయపడ్డారని ఎస్‌ఐ మలికార్జున తెలిపారు. ఆదోని నుంచి చౌలకాయల లోడుతో వెళుతున్న ఐచర్‌ లారీ ప్యాలకుర్తి దాటిన తర్వాత రోడ్‌ పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దకడుబూరు మండలం కె రంగాపురం గ్రామానికి చెందిన రైతు రవికుమార్‌ (30) మృతి చెందారు. ఈరన్న, బసవరాజు, క్రిష్ణంరాజు, సురేంద్ర, తిక్కయ్య, నాగప్ప గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే సిబ్బందితో కలిసి క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణమని భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:43:19+05:30 IST