లద్దగిరిలో రామదాసు రథోత్సవం
ABN , First Publish Date - 2020-12-13T05:55:57+05:30 IST
మండలంలోని లద్దగిరిలో శనివారం రామదాసు స్వామి రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య రమణీయంగా సాగింది.

- ప్రత్యేక పూజలు నిర్వహించిన కోట్ల కుటుంబం
కోడుమూరు (రూరల్) , డిసెంబరు 12: మండలంలోని లద్దగిరిలో శనివారం రామదాసు స్వామి రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య రమణీయంగా సాగింది. రామదాసు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఈ వేడుక నిర్వహించారు. ఆలయంలో వేకువజామున అభిషేకాలు, పుష్పార్చన చేశారు. కోట్ల కుటుంబ సభ్యులు సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల మధ్య రథంపై కొలువుదీర్చారు. రథానికి పూజలు నిర్వహించి రథాన్ని లాగేందుకు అనుమతించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథం ఆలయం వద్ద నుంచి గ్రామ వీధుల వరకు లాగారు. అనంతరం యధాస్థానానికి తీసుకెళ్లారు. ఆలయంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకా్షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ మర్యాదలతో పూజారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కోట్ల హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.