884.60 అడుగులకు చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిమట్టం
ABN , First Publish Date - 2020-10-03T13:17:05+05:30 IST
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1 లక్షల 38 వేల 264 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1 లక్ష 76 వేల 549 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.4011 టీఎంసీలగా నమోదు అయ్యింది. అటు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.