గాంధీ మార్గంలో నడుద్దాం: జేసీ రవి
ABN , First Publish Date - 2020-10-03T11:00:31+05:30 IST
మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ రవి అన్నారు. రామ్ భూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వై. రామలింగేశ్వరరెడ్డి మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను నిర్వహించారు.
కర్నూలు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేసీ రవి అన్నారు. రామ్ భూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వై. రామలింగేశ్వరరెడ్డి మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా జేసీ రవిపట్టన్ షెట్టి, నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ పి. రామలింగేశ్వర్, డీఆర్వో పుల్లయ్య, ఐసిడీయస్ పీడీ భాగ్యరేఖ, డీసీపీవో శారద, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్ తదితరులు విచ్చేశారు. వీరంతా కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం జేసీ మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గాన్ని యువతతో పాటు ప్రస్తుత సమాజం కూడా అనుసరించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఈశ్వరయ్య, ఉపాధ్యక్షురాలు షేక్ పర్వీన్ జబీనా, సభ్యులు రుక్మిణీ, మాదమ్మ, కోటేశ్వరి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.