నరకం తలపిస్తున్న రహదారులు
ABN , First Publish Date - 2020-10-01T08:45:48+05:30 IST
ఆలూరు నియోజకవర్గంలో రహదారులు నరకం తలపిస్తున్నాయని బీజేపీ నాయకలు అన్నారు. ఆస్పరిలోని అంబేడ్కర్ సర్కిల్ రోడ్డు గుంతలు పడి నీరు నిల్వ ఉండడంతో బుధవారం మొక్కలు నాటి నిరసన తెలిపారు. అనంతరం కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడారు. మోకాల్లోతు గుంతలు ఏర్పడి ప్రయాణం నరకమయమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
గుంతల్లో మొక్కలు నాటి బీజేపీ నాయకుల నిరసన
ఆస్పరి, సెప్టెంబరు 30: ఆలూరు నియోజకవర్గంలో రహదారులు నరకం తలపిస్తున్నాయని బీజేపీ నాయకలు అన్నారు. ఆస్పరిలోని అంబేడ్కర్ సర్కిల్ రోడ్డు గుంతలు పడి నీరు నిల్వ ఉండడంతో బుధవారం మొక్కలు నాటి నిరసన తెలిపారు. అనంతరం కార్యకర్తల విస్తృత సమావేశంలో మాట్లాడారు. మోకాల్లోతు గుంతలు ఏర్పడి ప్రయాణం నరకమయమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా ఇన్చార్జి నాగోతు రమే్షనాయుడు, జిల్లా నాయకుడు చంద్రమౌళి, రామస్వామి, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తంరెడ్డి, ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ వెంకటరాముడు, ఆస్పరి మండల కన్వీనర్ వీరేష్, నాయకులు మురళి, సుధాకర్, మునిస్వామి, దీపక్, రాథోడ్, సంజయ్, యాదలయ్య, రవి, అనిల్, కౌశిక్, కాశమ్మ, అరవింద్ పాల్గొన్నారు.