సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి కానుకలు
ABN , First Publish Date - 2020-09-28T11:23:40+05:30 IST
మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర పుణ్య క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారికి వెండి, నగదును భక్తులు బహూకరించారు. బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన దశరథరామయ్య 1.5 కిలోల వెండి నాగపడగను సమర్పించారు.
పాణ్యం, సెప్టెంబరు 27: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర పుణ్య క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారికి వెండి, నగదును భక్తులు బహూకరించారు. బేతంచెర్ల మండలం, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన దశరథరామయ్య 1.5 కిలోల వెండి నాగపడగను సమర్పించారు.
సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన గౌరిగారి సుఽధీర్కుమార్ రూ. 50 వేల నగదు, నంద్యాల గుడిపాటిగడ్డకు చెందిన దండె నాగయ్య రూ. 24,365 ను ఈలయ ఈవో రామకృష్ణ కు అందజేశారు. దాతలను ఆలయ సిబ్బంది ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాదు, అర్చకులు నారాయణశర్మ, సురేష్ శర్మ పాల్గొన్నారు.