57,500 ఎకరాల్లో వరి నష్టం
ABN , First Publish Date - 2020-12-13T05:55:19+05:30 IST
జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాల ధాటికి 57,500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

- జేడీఏ ఉమామహేశ్వరమ్మ
రుద్రవరం, డిసెంబరు 12: జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్ వర్షాల ధాటికి 57,500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. మండలంలోని చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, నరసాపురం గ్రామాల్లో శనివారం వరి పంటలను పరిశీలించారు. ఆ పంట పొలాలు ఈ-క్రాప్ చేయలేదని ఆమె దృష్టికి రైతులు తీసుకెళ్లారు. జేడీఏ స్పందించి ఈ-క్రాప్ చేయని వాటిని ఈ-క్రాప్ చేయిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జాయింట్ కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లయ్ అధికారులతో కూడా మాట్లాడారని తెలిపారు. ఈ- క్రాప్చేయని వరి పంట రైతులకు ఈ-క్రాప్ చేయించి నష్టపరిహారం అందేలా చూస్తామని, రైతులు అధైర్యపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు వరప్రసాద్, సుధాకర్, ఏవో ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.