పేదలకు మెరుగైన వైద్యం అందించండి
ABN , First Publish Date - 2020-12-10T05:35:48+05:30 IST
గ్రామస్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా చూడండి అని రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్ హేమలత అన్నారు.
- ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ హేమలత
నందికొట్కూరు రూరల్, డిసెంబరు 9: గ్రామస్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా చూడండి అని రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ప్రోగ్రాం జిల్లా కో ఆర్డినేటర్ హేమలత అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణకొట్కూరు ప్రాథమిక వైద్యశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ పేదలకు, బాలలకు సకాలంలో తగిన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జే.రేఖ, సిబ్బంది పాల్గొన్నారు.