-
-
Home » Andhra Pradesh » Kurnool » IIIT Exam postponed
-
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా
ABN , First Publish Date - 2020-11-28T05:22:07+05:30 IST
ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), నవంబరు 27: ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు ఈ విషయాన్ని గమనించాలని డీఈవో కోరారు.