పెద్ద దిక్కును కోల్పోయాను: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-01T08:29:22+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతితో రాజకీయంగా తాను పెద్దదిక్కును కోల్పోయానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

పెద్ద దిక్కును కోల్పోయాను: కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి

కర్నూలు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతితో రాజకీయంగా తాను పెద్దదిక్కును కోల్పోయానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆయన ఇక లేరన్న విషయం జీర్ణించుకోలేక పోయానన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ  భారతదేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు.


భారతదేశ సమగ్ర అభివృద్ధికి కృషిచేసిన కొద్దిమంది నాయకుల్లో ప్రణబ్‌ ఒకరని కొనియాడారు. సంక్షోభ పరిష్కర్తగా ఆయనకు ఎవరూ సాటిలేరని, అందుకే ఆయన్ను దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న వరించిందని అన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కోట్ల ప్రార్థించారు. . 


ఎంపీ టీజీ వెంకటేశ్‌ సంతాపం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 31: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా అనిన పార్టీల నేతలు అభిమానించే నేత ప్రణబ్‌ అని కొనియాడారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. నేటి నాయకులకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. 

Updated Date - 2020-09-01T08:29:22+05:30 IST