కార్యకర్తలకు అండగా ఉంటా: కోట్ల
ABN , First Publish Date - 2020-12-28T05:27:42+05:30 IST
టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకా్ష రెడ్డి అన్నారు.
![కార్యకర్తలకు అండగా ఉంటా: కోట్ల](https://media.andhrajyothy.com/appimg/galleries/202012271154393/12272020235732n80.jpg)
హాలహర్వి, డిసెంబరు 27: టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకా్ష రెడ్డి అన్నారు. ఆదివారం గూళ్యం, పచ్చరపల్లి గ్రామాల్లో పర్యటించారు. త్వరలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లురెడ్డి, రఘుప్రసాద్రెడ్డి, హరిరెడ్డి, ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు.