‘కరోనా పట్ల భయం వీడాలి’
ABN , First Publish Date - 2020-08-08T09:51:14+05:30 IST
కరోనా పట్ల భయం వీడాలని, జాగ్రత్తలు పాటిస్తే వైరస్ మహమ్మారిని తరిమికొట్టొచ్చని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ .
దేవనకొండ, ఆగస్టు: కరోనా పట్ల భయం వీడాలని, జాగ్రత్తలు పాటిస్తే వైరస్ మహమ్మారిని తరిమికొట్టొచ్చని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పల్లెబాటలో భాగంగా దేవనకొండలో కరోనా వైరస్ ప్రభావంపై ప్రజల్లో ఉన్న భయాందోళనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.మద్దిలేటిశెట్టి హాజరయ్యారు. దేవనకొండ బస్టాండు ప్రాంతంలో వారు మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం.నరసారావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జగదీశ్ పాల్గొన్నారు.