పుష్కర పనుల్లో అవినీతి

ABN , First Publish Date - 2020-11-21T06:10:50+05:30 IST

జిల్లాలో తుంగభద్ర పుష్కరాల కోసం చేసిన పనుల్లో అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తంరెడ్డి ఆరోపించారు.

పుష్కర పనుల్లో అవినీతి
మాట్లాడుతున్న పురుషోత్తంరెడ్డి

శబరి హౌస్‌ అరెస్టు దారుణం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి 


నందికొట్కూరు, నవంబరు 20: జిల్లాలో తుంగభద్ర పుష్కరాల కోసం చేసిన పనుల్లో అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నివాసంలో శుక్రవారం బీజేపీ కార్యకర్తలకు శిక్షణా తరగతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పురుషోత్తంరెడ్డి మాట్లాడారు. జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి రూ.230 కోట్లు ఖర్చు చేశారని, పనులు సక్రమంగా చేయకుండా నాసిరకంగా చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పుష్కర నిధుల ఖర్చు, అవినీతిపై ఏసీబీ కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తుంగభద్ర పుష్కర స్నానాలపై ప్రశ్నించిన బైరెడ్డి శబరి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పోలీ సులు హౌస్‌ అరెస్టు చేయడం దారుణమన్నారు. పుష్కరాల కోసం రూ.230 కోట్లు విడుదల చేసి, ఆ నిధులు ఖర్చు చేశాక ప్రభుత్వం పుష్కర స్నానాలు చేయవద్దంటోందని, నిధుల విడుదలకు ముందు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, భూమా రాజశేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నాగరాజు, నాగేశ్వరరావు, బంగారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T06:10:50+05:30 IST