కరోనా ఐసీయూ వార్డు తనిఖీ

ABN , First Publish Date - 2020-06-18T10:30:38+05:30 IST

స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఐసీయూ వార్డును కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌

కరోనా ఐసీయూ వార్డు తనిఖీ

కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 17: స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని  ఐసీయూ వార్డును కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఐసీ యూలో వెంటిలేటర్‌పై ఉన్న అత్యవసర రోగులకు అందిస్తున్న చికిత్సను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎ.భగవాన్‌, ప్రొఫెసర్లు డా.ఇక్బాల్‌ హుశేన్‌, డా.రవికళాధర్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-06-18T10:30:38+05:30 IST