నీటి ఎద్దడిపై కలెక్టర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-17T09:57:49+05:30 IST
ఆదోని మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి గురించి కలెక్టర్ వీరపాండియన్కు

ఆదోని టౌన్, మే 16: ఆదోని మండలంలోని అనేక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి గురించి కలెక్టర్ వీరపాండియన్కు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రకా్షజైన్ శనివారం ఫిర్యాదు చేశారు. మండలంలోని పెద్దతుంబళం మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలకు ఫిల్టర్ కాని తాగునీటిని సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిల్టర్కాని పచ్చరంగులోని తాగునీటినే ప్రజలు తాగాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన అధికారులు కరోనా సాకుతో ఫిల్టర్కాని నీటినే సరఫరా చేయడం సమంజసం కాదన్నారు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పెద్దతుంబలం గ్రామంతో పాటు పెసలబండ, బైచిగేరి, నెట్టేకల్లు, జీహొసల్లి, సంతెకుడ్లూరు గ్రామాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కలెక్టర్ను కోరినట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్జైన్ తెలిపారు.