రెండు గంటలే కాల్చాలి: ఆర్డీవో
ABN , First Publish Date - 2020-11-13T05:59:27+05:30 IST
జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) సూచనల మేరకు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం 2 గంటలే టపాసులు కాల్చుకోవా లని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు.
ఆలూరు, నవంబరు 12: జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) సూచనల మేరకు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కేవలం 2 గంటలే టపాసులు కాల్చుకోవా లని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం ఆర్డీవో కార్యా లయంలో బాణసంచా వ్యాపారులు, పోలీ సులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు టపాసులు విక్రయించే సమయంలో శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. తహసీల్దార్ రామకృష్ణ, సీఐలు చంద్రశేఖర్, శ్రీరాములు, క్రాకర్స్ యజమానులు పాల్గొన్నారు.