నీటి ట్యాంకులో పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-12-31T04:52:46+05:30 IST

నీటి ట్యాంకులో పడి ఓ బాలుడి బుధవారం మృతి చెందాడు.

నీటి ట్యాంకులో పడి బాలుడి మృతి


ఎమ్మిగనూరు టౌన్‌, డిసెంబరు 30:  నీటి ట్యాంకులో పడి ఓ బాలుడి బుధవారం మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ, బైటింటి శ్రీనివా సులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీరాముడు(5) సి.బెళగల్‌ మండలం కంబదహాల్‌ గ్రామంలో అవ్వ దగ్గర గతేడాదిగా ఉంటు న్నాడు. రోజులానే కుటుంబసభ్యులతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ట్యాంకులో పడిపో యి ఊపిరాడక మృతి చెందాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. 


Updated Date - 2020-12-31T04:52:46+05:30 IST