డీఎల్పీవో, డీపీఆర్సీలో సర్టిఫికెట్ల పరిశీలన
ABN , First Publish Date - 2020-11-07T06:00:42+05:30 IST
గ్రామ సచివాలయాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 అభ్యర్థులకు శుక్రవారం జిల్లా పరిషత్ ఆవరణలోని డీఎల్పీవో, డీపీఆర్సీ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది.
![డీఎల్పీవో, డీపీఆర్సీలో సర్టిఫికెట్ల పరిశీలన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు(న్యూసిటీ), నవంబరు 5: గ్రామ సచివాలయాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 అభ్యర్థులకు శుక్రవారం జిల్లా పరిషత్ ఆవరణలోని డీఎల్పీవో, డీపీఆర్సీ కార్యాలయాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి కేఎల్.ప్రభాకర్రావు పర్యవేక్షణలో ఈవోఆర్డీలు రఘునాథ్, మణిమంజరి, శివ, వరప్రసాద్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. 214 మంది హాజరయ్యారు. మిగిలిన వారికి శనివారం సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీపీవో తెలిపారు.