టీడీపీ కార్యకర్తలకు బీవీ పరామర్శ
ABN , First Publish Date - 2020-11-29T05:29:56+05:30 IST
పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను శనివారం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు.
ఎమ్మిగనూరు, నవంబరు 28: పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను శనివారం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు. 24వ వార్డులో మూర్తిస్వామి, 15 వార్డులో బషీర్ అహమ్మద్, 7వ వార్డులో హనుమన్న, 19వ వార్డులో మునిస్వామికి ధైర్యం చెప్పారు. కేఎండీ ఫరూక్, మాజీ కౌన్సిలర్ దాదాసాహెబ్, రఫీక్, మహేష్ పాల్గొన్నారు.