కరోనాతో సహజీవనం చేయాలనడం హాస్యాస్పదం
ABN , First Publish Date - 2020-11-27T05:49:18+05:30 IST
కరోనాతో సహజీవనం చేయాలనడం హాస్యాస్పదమని, పుష్కరాల్లో స్నానాలు లేకుండా పిండప్రదానం ఎలా చేస్తా రని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశ్నించారు.
- స్నానాలు లేకుండా పిండ ప్రదానం ఎలా?
- మాజీ ఎమ్మెల్యే బీవీ
నందవరం, నవంబరు 26: కరోనాతో సహజీవనం చేయాలనడం హాస్యాస్పదమని, పుష్కరాల్లో స్నానాలు లేకుండా పిండప్రదానం ఎలా చేస్తా రని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశ్నించారు. కరోనాతో సహజీవనం చేయాలనడం హాస్యాస్పదమని, పుష్కరాల్లో స్నానాలు లేకుండా పిండప్రదానం ఎలా చేస్తా రని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన గురుజాల రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర స్నానాలకు అనుమతించకపో వడం విచాకరమన్నారు. రూ.కోట్ల నిధులను వైసీపీ నాయకులు దండుకున్నార న్నారు. జగన్ పాలన అస్తవ్యస్తమైందని, ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే ఆలోచనతోనే భయపడి సీఎం జగన్ ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఏడదిన్నర గడచినా అభివృద్ధి లేదని, టీడీపీ హయాంలో రూ.కోట్ల నిధులతో ఎన్నో అభి వృద్ధి పనులు చేశామని అన్నారు. మాజీ జడ్పీటీసీ ఈరన్నగౌడు, రైస్మిల్ నారాయణరెడ్డి, ఎల్లెల్సీ మాజీ డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి, ఖాసింవలి, ధర్మా పురం గోపాల్, గడంగం నరసింహులు, రామకృష్ణరెడ్డి, జబ్బార్ పాల్గొన్నారు.