‘జీవో 77ను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2020-12-29T04:48:43+05:30 IST

విద్యాదీవెన, అమ్మఒడి పథకం అన్ని వర్గాల విద్యార్థులకు వర్తింపజేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు షాబిర్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప కోరారు.

‘జీవో 77ను రద్దు చేయాలి’


ఆదోని, డిసెంబరు 28: విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్‌ 77ను తక్షణమే రద్దు చేయాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా నాయకులు తేజ, జైసూర్య డిమాండ్‌ చేశారు. సోమవారం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో  అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసేందుకు పూనుకున్నారన్నారు. జీవో నంబర్‌ 77 వలన రాష్ట్రంలో సుమారు లక్ష మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్‌మెంట్‌ అందకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ప్రైవేట్‌, ఎడిట్‌ కశాశాల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా, దీవెన కానుక పథకం యధావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే 77ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నూర్‌, గురు, మహేష్‌, విష్ణు, సూర్య పాల్గొన్నారు. 



ఆదోని(అగ్రికల్చర్‌): విద్యాదీవెన, అమ్మఒడి పథకం అన్ని వర్గాల విద్యార్థులకు వర్తింపజేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర సమితి సభ్యుడు షాబిర్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప కోరారు. సోమవారం ఆర్ట్స్‌ కళాశాల రహదారిలో విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు.  కార్యక్రమంలో డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రాజు, బాలకృష్ణ, కీరా, రాము, రంగ, ఉమేష్‌, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:48:43+05:30 IST