వైభవంగా స్వాతి వేడుకలు
ABN , First Publish Date - 2020-10-19T11:10:50+05:30 IST
వైభవంగా స్వాతి వేడుకలు

ఆళ్లగడ్డ, అక్టోబరు 18: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలను ఆదివారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మఠం మేనేజర్ వైకుంఠస్వామి ఉత్సవమూర్తులను వేకువజామున్నె విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి సమక్షంలో సదర్శన హోమాన్ని చేపట్టారు. అలాగే నవనరసింహక్షేత్రాల్లో వేద పండితులు ఉత్సవమూర్తులకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నవనారసింహులను దర్శించుకున్నారు.