అమ్మఒడి నమోదు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-17T05:35:02+05:30 IST
జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని, హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులు గుర్తించాలని డీఈవో సాయిరాం బుధవారం ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 16: జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించామని, హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులు గుర్తించాలని డీఈవో సాయిరాం బుధవారం ప్రకటనలో తెలిపారు. కొత్త విద్యార్థుల నమోదు, ఇప్పటికే విద్యార్థుల నవీకరణ చేయాలన్నారు. అర్హత ఉన్న తల్లుల జాబితాను ఈ నెల 20వ తేదీన పాఠశాల, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని డీఈవో ఆదేశించారు.