అహోబిలంలో పూజలు

ABN , First Publish Date - 2020-12-13T05:37:57+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది.

అహోబిలంలో పూజలు

ఆళ్లగడ్డ, డిసెంబరు 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. లక్ష్మీనరసింహస్వామికి శనివారం ముఖ్యదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. 


దర్శించుకున్న ఎన్నికల పరిశీలకులు

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు శోభ శనివారం దర్శించుకున్నారు. ఆమె రాకను పురష్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం మేనేజర్‌ వైకుంఠస్వామి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె చేత స్వామికి విశేషపూజలు చేయించారు. తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఆమె వెంట ఆళ్లగడ్డ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-12-13T05:37:57+05:30 IST