కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-12-06T05:17:46+05:30 IST
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై హుశేనాపురం బస్ స్టేజీ వద్ద హుశేనాపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.

ఓర్వకల్లు, డిసెంబరు 5: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై హుశేనాపురం బస్ స్టేజీ వద్ద హుశేనాపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది. సుబ్బమ్మకు తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.