ఏడు గంటల్లో 14 ఎకరాల్లో విత్తనం
ABN , First Publish Date - 2020-12-29T05:34:15+05:30 IST
మండలంలోని పందిర్లపల్లె గ్రామానికి చెందిన రైతు అగ్గిపెట్టెల లక్ష్మన్న పొలంలో అదే గ్రామానికి చెందిన సెనకల లాలు ఎద్దులు 14 ఎకరాలలో వేరుశనగ విత్తనాలు వేసి ఔరా అనిపించాయి.
క్రిష్ణగిరి, డిసెంబరు 28: మండలంలోని పందిర్లపల్లె గ్రామానికి చెందిన రైతు అగ్గిపెట్టెల లక్ష్మన్న పొలంలో అదే గ్రామానికి చెందిన సెనకల లాలు ఎద్దులు 14 ఎకరాలలో వేరుశనగ విత్తనాలు వేసి ఔరా అనిపించాయి. ఏడు గంటల్లో 14 ఎకరాలను నాలుగు కొయ్యల గొర్రుతో విత్తనం పూర్తి చేశాయి. దీంతో సోమవారం ఎద్దులను గ్రామంలో ఊరేగించారు.