ఆరుగురిపై కేసు
ABN , First Publish Date - 2020-11-28T05:06:27+05:30 IST
డబ్బు విషయంలో ఆరుగురు కట్టెలు, రాడ్డులతో దాడి చేశారని బేతంచెర్ల మండలంలోని పెండేకల్ గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
బేతంచెర్ల, నవంబరు 27: డబ్బు విషయంలో ఆరుగురు కట్టెలు, రాడ్డులతో దాడి చేశారని బేతంచెర్ల మండలంలోని పెండేకల్ గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన తల్లి డబ్బు విషయంలో తన బావమరిది ఎర్రమలతో పాటు అతడి కుమారులు సునాకర్, సూరి, గోవిందు మరో ఇద్దరు మహిళలు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరుగురిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ రమణ తెలిపారు.