పట్టా సబ్ డివిజన్పై పరిశీలన
ABN , First Publish Date - 2020-11-25T06:17:52+05:30 IST
పట్టా సబ్ డివిజన్పై పరిశీలన
విజయవాడ రూరల్, నవంబరు 24 : పట్టా సబ్ డివిజన్ విధానంపై ట్రైనీ ఐఏఎస్ అధికారులు నున్నలో భూములను మంగళవారం పరిశీలించారు. రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారుల బృందం పట్టా సబ్ డివిజన్ సర్వే విధానంపై నున్నలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తహసీల్దార్ బీ సాయి శ్రీనివాస్ నాయక్, సర్వేయర్ రమేష్తో కూడిన అఽధికారులు సబ్ డివిజన్, సర్వే విధానం గురించి వివరించారు.