తాయిలాలు అక్కర్లేదు...ప్రాణ రక్షణ కావాలి: దేవతోటి
ABN , First Publish Date - 2020-12-26T16:32:44+05:30 IST
సీఎం జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దళితుల జరుగుతున్న దాడులపై మండిపడ్డారు.
![తాయిలాలు అక్కర్లేదు...ప్రాణ రక్షణ కావాలి: దేవతోటి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి: సీఎం జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దళితుల జరుగుతున్న దాడులపై మండిపడ్డారు. ‘‘అయ్యా జగన్ రెడ్డి.. మీ ఉచిత పథకాల తాయిలాలు మాకేం అక్కర్లేదు., మా దళిత బిడ్డల మాన ప్రాణ రక్షణ కావాలి., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డలపై జరుగుతున్న దాడుల గురించి జగన్ రెడ్డితో సహా వైసీపీ నేతలoతా ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అంటూ నాగరాజు హితవు పలికారు.